Listen to this article

జనం న్యూస్,జూన్14,అచ్యుతాపురం

:అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల పాటు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ యోగాంధ్రను నిర్వహిస్తున్నారు.మే 21వ తేదీ నుంచి జూన్ 21 వరకు నెలరోజుల పాటు యోగాంధ్ర- 2025 చేపడుతున్నారు.అందులో భాగంగానే మండల కేంద్రమైన అచ్యుతాపురం పంచాయతీ కార్యాలయంలో యోగ ఆసనాలు వేయడం జరిగింది.ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరు యోగా చేయాలని మన శరీరం, మనసును ఆధీనంలో ఉంచుకునేందుకు యోగా ఎంతో ఉపయోగ పడుతుందని సర్పంచ్ కె. విమలా నాయుడు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉద్యోగులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.