

జనం న్యూస్,జూన్14,అచ్యుతాపురం:
మండలం లోని పూడిమడక గ్రామం ప్రధాన రహదారికి ఇరువైపులా మరియు గ్రామంలో పలు చోట్ల పేరుకుపోయిన చెత్తను జేసీబీ సాయంతో ట్రాక్టర్లు ద్వారా శనివారం తొలగించడం జరిగింది అని, వాహనాలు ద్వారా ఇంటింటికి చెత్త సేకరణ ప్రక్రియ జరుపుతుండగా.. అక్కడకక్కడ కొందరు బహిరంగంగానే చెత్త వేస్తున్నారని,చెత్తను తీసుకుని వెళ్లే వాహనాలు పైన చెత్త వేయడం ద్వారా మన చుట్టూ ఉన్న పరిసరాలను
పరిశుభ్రంగా ఉంచుకోగలుగుతామని,త్రాగునీరు వోల్వోలో చెత్త మరియు ప్లాస్టిక్ బాటిల్స్ ను పడేయడం వల్ల అందరూ ఇబ్బంది పడవాల్సి వస్తుందని సర్పంచ్ చేపల సుహాసిని వెంకటరమణ తెలిపారు.రోడ్డు వెంబడి చెత్త చెదారం ఉన్న పరిసరాలను శుభ్రం చేయించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.