

జనం న్యూస్ ;14 జూన్ శనివారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
యాదవ విద్యావంతులు ఉద్యోగులు తమ జాతి చైతన్యం కోసం పాటుపడి చైతన్యం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని శ్రీకృష్ణ యాదవ పంక్షన్ హాల్ ఆర్థిక కార్యదర్శి బాగు యాదగిరి యాదవ్ అన్నారు. శనివారం యాదవ ఎంప్లాయిస్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్ సిద్దిపేటలో సమావేశం జరిగింది. యాదవ ఉద్యోగుల సమాచారాన్ని సాంకేతికంగా పొందుపరిచిన ధరబోయిన రాజు యాదవ్ ను సత్కరించారు. అధ్యక్షులు బైరి అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజంలో చైతన్యం వస్తుందని అందుకు అందరు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఉండ్రాళ్ళ రాజేశం యాదవ్, గొర్రె మల్లికార్జున్ యాదవ్, తలారి చంద్రశేఖర్ యాదవ్, దాసరి రాజుయాదవ్, చింతల బాల్ నర్సయ్య యాదవ్, అక్కెం ఐలయ్య యాదవ్, కాల్వ రాజయ్య యాదవ్, జక్కుల రాజేశం యాదవ్, బైరి రమేష్ యాదవ్, కట్ట బిక్షపతి యాదవ్, బాగు రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.