

జనం న్యూస్ 15 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జిల్లా వ్యాప్తంగా యోగా మాక్ డ్రిల్ ను నేడు విజయవంతంగా నిర్వహించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21 తేదీన ప్రధాని మోదీ విశాఖలో పాల్గొంటున్న యోగా కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిలో భాగంగా గతనెల 21 నుంచి యోగాంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూన్ 21న రికార్డు స్థాయిలో జరిగే ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమానికి సన్నద్ధమవుతున్నారు.