

జనం న్యూస్- జూన్- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నందికొండ మున్సిపాలిటీ పరిధిలో హైదరాబాద్ నగరానికి చెందిన యువతి అత్తమామల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది, నాగార్జునసాగర్ టౌన్ ఎస్సై సంపత్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన జశ్విత(28) ను తన భర్త, అత్తమామలు వరకట్నం తేవాలని చాలా రోజులుగా వేధిస్తున్నారని వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుని చనిపోదామని తన కారులో ఒంటరిగా హైదరాబాదు నుంచి బయలుదేరి నాగార్జునసాగర్ కు చేరుకొని తనతో పాటు తెచ్చుకున్న విషయాన్ని తాగి చివరి నిమిషంలో తన తల్లిదండ్రులకు ఫోన్ చేయగా, జశ్విత తండ్రి కూకట్పల్లి పోలీసులను సంప్రదించగా వారు వెంటనే నాగార్జునసాగర్ టౌన్ పోలీసులను అప్రమత్తం చేయగా ఎస్సై సంపత్ గౌడ్ తన బృందంతో కలసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తను పడిపోయి ఉన్నా స్థలానికి చేరుకొని హుటాహుటిన కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు,, జశ్విత తల్లిదండ్రులు నాగార్జునసాగర్ చేరుకొని మెరుగైన చికిత్స కోసం జశ్వితను హైదరాబాద్ కు తరలించారని ఎస్సై సంపత్ గౌడ్ తెలిపారు. సమాచారం ఇవ్వగానే తక్షణమే స్పందించి తమ కూతురి ప్రాణాలను నిలబెట్టిన నాగార్జునసాగర్ టౌన్ ఎస్ఐ సంపత్ గౌడ్ కు మరియు పోలీస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.