Listen to this article

(జనం న్యూస్ చంటి జూన్ 16)

తొగుట మండల కేంద్రంలోని లింగంపేట గ్రామానికి చెందిన మండల రంగయ్య గ్రామ పంచాయితీ సపాయి కార్మికుడు నిన్న మధ్యాహ్నం గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈ విషయము తెలుసుకున్న గ్రామస్తులు వారికి తోచినంత ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది తోటి స్నేహితులు మరియు యూత్ సభ్యులు గ్రామ ప్రజలు వారికి తోచినంత ఈరోజు ఆర్థిక సహాయం మండల రంగయ్య కుటుంబానికి అందించడం జరిగింది. మరియు ఇటువంటి సహాయం చేసిన గ్రామ ప్రజలకు యూత్ స్నేహితులకు అందరికీ పేరుపేరునా రంగయ్య కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.