Listen to this article

జనం న్యూస్ 16 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

దూకుడు సినిమాలో బ్రహ్మానందం చెప్పిన ఈ డైలాగ్ ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో బాగా వినిపిస్తోంది. విద్యా సంస్థలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులతోపాటు అదనపు భారాలు తల్లిదండ్రులపై మోపుతున్నాయి. రూ. వేలల్లో ఫీజులతో పాటు నిబంధనలకు విరుద్ధంగా బుక్స్, యూనిఫాం స్కూల్స్లోనే అమ్మేస్తున్నారు. రెండింటికీ కలిపి రూ.10 వేలకు పైగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. మరి మీ దగ్గర ఈ దందా నడుస్తోందా.