

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.
జనం న్యూస్ 16 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు జూన్ 15న మందుబాబులను హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మందుబాబులపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టేందుకుగాను జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, న్యూసెన్సు చేస్తూ, ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై దాడులు చేయాలని, వారిపై కేసులు నమోదు చేయాలని, పట్టుబడిన మైనర్లుకు, మందుబాబులకు కౌన్సిలింగు నిర్వహించాలని అధికారులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూన్ 15న స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా సంబంధిత పోలీసు అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా లే-అవుట్లు, గ్రామ శివారు ప్రాంతాల్లోను, నగర శివారు ప్రాంతాల్లోను, బహిరంగంగా మద్యం సేవించిన వారిపై పోలీసు అధికారులు,
సిబ్బంది డ్రోన్స్తో దాడులు నిర్వహిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తూ, ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్న మందుబాబులపై కేసులు నమోదు చేస్తున్నారు. వాహన తనిఖీలు చేపట్టిన పోలీసు అధికారులు, సిబ్బంది రహదారి భద్రత నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు ఈ-చలానాలను విధించారని జిల్లా ఎస్పీ తెలిపారు. అదే విధంగా మద్యం సేవించి, వాహనాలు నడిపిన వాహనదారులపై కేసులు నమోదు చేయడం, రహదారి భద్రత నియమాలు ఉల్లంఘించిన వారిపై ఈ చలానాలను విధిస్తున్నారు. ఈ సంవత్సరంలో గడిచిన ఐదు మాసాల్లో జనవరి 1 నుండి మే 31 వరకు మద్యం సేవించి, వాహనాలు నడిపిన వారిపై 2,178 కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై ప్రభుత్వం 9,095 కేసులు నమోదు చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు. మద్యం సేవించి, పట్టుబడిన మందుబాబులకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించవద్దని, ప్రజాశాంతికి భంగం కలిగించవద్దని
సంబంధిత పోలీసు అధికారులు కౌన్సిలింగు నిర్వహించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.