

జనం న్యూస్ 16 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జూన్ 21న విశాఖలో జరిగే యోగా దినోత్సవంలో భారీగా ఉత్తరాంధ్ర ప్రజలను భాగస్వాములు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. విజయనగరం నుంచి వచ్చే వారిని ప్రత్యేక బస్సుల్లో భీమిలి మీదుగా బీచ్ రోడ్డుకు తరలించనున్నారు. యోగాలో పాల్గొనే వారందరికీ ఉచితంగా టీపగ్టులు, మ్యాట్లు ఇవ్వనున్నారు. కేక్, బిస్కెట్ ప్యాకెట్, అరటిపండు, పల్లి చిక్కీ, టాటా గ్లూకోజ్, వాటర్ బాటిల్ వంటి స్నాక్స్ ఇస్తారు.