

జనం న్యూస్ జనవరి 23 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో గురువారం రోజున మండల అభివృద్ధి అధికారి గౌరీ శంకర్, మండల ఎస్సై కొట్టె ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా ఆర్టిఐ లైవ్ న్యూస్ ఛానల్ మరియు ఆర్టిఐ నిఘా డిజిటల్ దినపత్రిక నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ఎల్లప్పుడూ వాస్తవాలను ప్రజల వద్దకు చేరుస్తూ, నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రజాదారణ పొందిన పత్రికలు అని అభినందించారు. అదేవిధంగా జనాలను చైతన్యపరుస్తు నిజాయితీగా ప్రశ్నించే ధైర్యాన్ని ఇచ్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్ఐలతో పాటు ఏపీవో రాజన్న,ఈసీ రజనీకాంత్, జిల్లా ఆర్టీ ఐ
,లైవ్ న్యూస్ఛానల్ క్రైమ్ రిపోర్టర్ కుమ్మరి లింగయ్య,, రాజలింగు రిపోర్టర్ దామోదర్, నరేందర్,సమాచారహక్కు రక్షణ చట్టం సభ్యులు ఓంప్రకాష్,ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.