Listen to this article

జనం న్యూస్ తర్లుపాడు మండలం. జూన్ 16

తర్లుపాడు గ్రామం లో గల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 1993-1994 పదవ తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం నాడు సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు, తమ గురువులు అయిన జె. కృష్ణ మూర్తి, యన్ సి కృష్ణ రెడ్డి, అన్విలాషిణి,పిన్నిక శ్రీహరి,పోలేబోయిన ముసలయ్య ఉపాధ్యాయులను పూలమాలతో శాలువాతో సత్కరించారు, అనంతరం పాత జ్ఞాపకాలను, తీపి గుర్తులను నెమరేసుకున్నారు, ఈ కార్యక్రమం లో స్కూల్ చైర్మన్ వెన్నా రాజా రామ్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు యం సుధాకర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు