Listen to this article

జనంన్యూస్. 16. సిరికొండ. ప్రతినిధి.

సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భీంగల్ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య

ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్స్

రైతాంగ పోరాటయోధుడు అఖిలభారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు అమరుడు కామ్రేడ్ నాయక వాడి నరసయ్య ఆశయాల సాధనకై పోరాడుదాం అని ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్స్ అన్నారు. సోమవారం రోజున అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో సిరికొండ లో నరసయ్య సంతాప సభను నిర్వహించారు. ముందుగా కామ్రేడ్ నరసన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్స్ మాట్లాడుతూ అర్సపల్లి నివాసి అయిన కామ్రేడ్ నాయక్ వాడి నరసయ్య అనేక రైతాంగ ఉద్యమాలు నడిపాడని నిజాంసాగర్ ఆయకట్ట రక్షణకై జరిగిన రైతు ఉద్యమం ఎన్సీఎస్ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ నీ తేరిపించాలని జరిగిన ఉద్యమలో పంటలకు గిట్టుబాటు ధర రావాలని విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో ఇలా మొత్తం జిల్లా రైతాంగ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ముందు వరుసలో ఉన్నారని మార్క్స్ అన్నారు. అంతిమంగా దేశంలో రైతు కూలీ రాజ్యం రావాలని తపించి పోరాడిన గొప్ప రైతు నాయకుడని అన్నారు. అలాంటి ప్రజల మనిషి మన మధ్యన నుండి 3-06- 2025న అనారోగ్యంతో మరణించడం రైతు ప్రజా ఉద్యమాలకు తీరని లోటుఅని అన్నారు. దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలని చేపడుతున్నాయని అన్నారు. దేశంలోని వనరులు బడా పెట్టుబడిదారులకు సామ్రాజ్యవాదులకు కట్టబెడుతున్నారని ఆ వెలుగులోనే వ్యవసాయ రంగంలో వచ్చిన మూడు నల్ల చట్టాలు అన్నారు. వ్యవసాయ రంగంలో రైతుల పెట్టుబడులు పెరుగుతుంటే రైతు పంటలకు మాత్రం గిట్టుబాటు ధర రావడంలేదని కనీసం ఎంఎస్పి మద్దతు ధరల చట్టాన్ని పాలకులు చేయలేకపోతున్నారని వారన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రజా పాలన పేరుతో ప్రజల్ని మోసం చేస్తూ ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయకుండా విఫలమైందని నేటికీ రైతు రుణమాఫీ అమలు చేయలేదని అన్నారు. ప్రజా రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బలమైన రైతాంగ ఉద్యమాలు నడపడమే కామ్రేడ్ నరసన్నకు అర్పించే ఘననివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షులు నిమ్మల భూమేష్, కార్యదర్శి పి.ఎల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు గులాం హుస్సేన్, పివైఎల్ మండల అధ్యక్షులు మల్కి సంజీవ్ నాయకులు చిన్న గంగాధర్, నర్సాగౌడ్ , గాదె నర్సయ్య, పెద్దరాజగౌడ్,జాకీర్, తదితరులు పాల్గొన్నారు.