

జనం న్యూస్ జూన్ 16 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్.. ఏసీబీ విచారణ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజకవర్గ కార్పొరేటర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు మహిళా నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి సంఘీభావం తెలిపారు. ముందుగా తెలంగాణ భవన వద్దకు చేరుకుని.. అనంతరం ఏసీబీ కార్యాలయం వద్ద తమ సంఘీభావం తెలిపారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ప్రజలకు చేసేది ఏమీ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు పెట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని.. కానీ ధర్మం ఎప్పటికైనా నిలుస్తుందని ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కెసిఆర్, కేటీఆర్ కే దక్కుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే హైదరాబాద్ మరియు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ఏ మేరకు తీసుకు వచ్చిందో ప్రజలే గమనిస్తున్నారని అన్నారు.. ఇకనైనా పరిపాలనపై దృష్టి పెట్టి ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలు ,మౌలిక సదుపాయాలు అందించాలని సూచించారు .కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రంగాలు తెలంగాణలో కుదేలు అయిపోయాయని.. వ్యాపారాలు లేక చిరు వ్యాపారుల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా కన్నీరు మున్నీరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ కెసిఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు…