Listen to this article

బిచ్కుంద జూన్ 15 జనం న్యూస్

జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం లో 11ఏళ్లలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి, పథకాల యొక్క కరపత్రాలను విడుదల చేయడమైనది బిచ్కుంద బిజెపి మండల పార్టీ అధ్యక్షులు శెట్పల్లి విష్ణు మాట్లాడుతూ అన్నార్థుల ఆకలి తీర్చి పేదలకు ఆవాసం కల్పించి ప్రతీ ఇంటికి తాగునీరు అందించి ఎంతోమందికి స్వయం ఉపాధిని చూపించిన పేదల పెన్నిది మన నరేంద్ర మోదీ 11 వసంతాల్లోనే ప్రతీ సామాన్యుడి జీవితంలో అనూహ్య మార్పులు తెచ్చిన మహా నాయకుడు మన మోదీ అన్నారు. కార్యక్రమాలపై బూత్ స్థాయిలో దశలవారీ సన్నాహకాల్లో భాగంగా బిచ్కుంద లో వర్క్‌షాప్‌ నిర్వహించడం జరిగింది.
ఈ కార పత్రాల కార్యక్రమంలో విస్తృతంగా ప్రజలకు చేరువ కావడం కోసం బూత్ స్థాయి అధ్యక్షులకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల జనరల్ సెక్రెటరీ ముత్యం పిరజి, బిచ్కుంద మండల ఇంచార్జ్ శివాజీ పటేల్, బూత్ అధ్యక్షులు మోహన్ దేశాయ్, జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాల్ చారి, గణపతి, మొగలు గొండ, అంజియా, గంగాధర్ ,శంకర్ తదితరులు పాల్గొన్నారు