

సంవత్సర ఫీజు కడితేనే టి సి ఇస్తామని తల్లిదండ్రులకు బహిరంగ మెసేజ్ లు పెడుతున్న డిఏవి స్కూల్ యాజమాన్యం
జనం న్యూస్ – జూన్ 16- నాగార్జునసాగర్ టౌన్-
నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని డిఏవి స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు పంపిస్తున్న వాట్సాప్ మెసేజ్ లు నాగార్జునసాగర్ లో విద్యార్థుల తల్లిదండ్రుల లొ కలకలం రేపుతున్నాయి, వివరాల్లోకి వెళితే నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలో నిర్వహిస్తున్న డిఏవి స్కూల్ లొ అనేక కారణాలతో పాఠశాల విడిచి వెళ్లాలనుకున్న విద్యార్థులకు ఆ స్కూలు యాజమాన్యం చుక్కలు చూపిస్తుంది, జూన్ 5 లోపు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ( టి సి) కోసం దరఖాస్తు పెట్టుకున్న విద్యార్థులకు మాత్రమే టీసీలు ఇస్తామని జూన్ 5 తర్వాత ఏదైనా కారణాలతో స్కూల్ విడిచి వెళ్లాలనుకున్న విద్యార్థులు పూర్తి సంవత్సర ఫీజు కడితేనే టీసీలు ఇస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్స్అప్ మెసేజ్ లు పంపిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు రోజులు కూడా గడవకముందే యాజమాన్యం ఇలా సంవత్సరం మొత్తం ఫీజు చెల్లించమనడం ఎంతవరకు భావ్యమని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.