

జనం న్యూస్ – జూన్ 16- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
ప్రపంచ పర్యాటక క్షేత్రమైన నాగార్జునసాగర్ లోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధ వనంలో సిబ్బంది లేక నడవని బ్యాటరీ వాహనాలతో పర్యాటకులకు తప్పని తిప్పలు, నాగార్జునసాగర్ బుద్ధ వనంలో సెలవు రోజైన ఆదివారం నాడు డ్రైవర్లు అందుబాటులో లేక తిరగని బ్యాటరీ వాహనాలు, ఆదివారం రోజు పర్యాటకులు అధికంగా నాగార్జున సాగర్ ను,బుద్దవనాన్ని సందర్శిస్తారు అయినా కూడా అధికారులు డ్రైవర్లు లేరు అనే సాకుతో బ్యాటరీ వాహనాలను తిప్పడం లేదు, సుమారు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న బుద్ధవనంలో పెద్దలు, పిల్లలు, నడవలేని వారి కోసం ఈ బ్యాటరీ వాహనాలను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక టికెట్ తో పర్యాటకుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తే సిబ్బంది నిర్లక్ష్యంతో అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ వాహనాలను నడపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, పర్యాటకుల వాహనాలను లోపలికి అనుమతించకపోవడంతో పలువురు వృద్ధులు, పిల్లలు బుద్ధ వనాన్ని పూర్తిగా సందర్శించకుండానే తిరిగివెళ్లాల్సి వస్తుందని పర్యాటకులు వాపోతున్నారు, శని, ఆదివారాలు, సెలవు దినాల్లో మాత్రమే నాగార్జునసాగర్ సందర్శనకు పర్యాటకులు అధికంగా వస్తుంటారు అధికారులు ఈ విషయం తెలిసి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే డ్రైవర్లకు సెలవు ఇవ్వటం ఏంటని పర్యాటకులు మండిపడుతున్నారు. ఈ విషయమై బుద్ధవనం అధికారులను అడగగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా చూడాలని బ్యాటరీ వాహనాలను నిత్యం తిరిగే విధంగా ఏర్పాటు చేయాలని పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు.