

(జనంన్యూస్ జూన్ 16 భీమారం మండల ప్రతినిధి కాజీపేట రవి)
గత మూడు నాలుగు నెలలుగా ఉపాధి హామీ కూలీలు పని చేసిన కూలికి వేతనాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జానెడు పొట్టకోసం బారెడు కష్టాలు పడుతున్న కూలీలు, కనీస గిట్టు బాటు కూలి లేక పైసలు రాక ఆకలితో అలమటిస్తున్నారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలం పలు గ్రామాలలో ఈ సంక్షోభం మరింత తీవ్రంగా ఉంది. కూలీలు నెలలుగా ఎదురుచూస్తూ ఆకలితో బతుకుతున్నారు. ఉపాధి హామీ కూలీల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఇన్సూరెన్స్ లేదు మద్దతుకూలి లేకపోవడం, పని చేసిన వేతనాలు చెల్లించకపోవడం వల్ల కూలి దారులు నిరాశ నిర్బంధం మధ్య కొట్టుమిట్టాడుతు న్నామని కూలీలు చెబుతున్నారు.ఇకనైనా ప్రభుత్వాలు జోక్యం చేసుకొని బకాయిలను వెంటనే చెల్లించాలి. లేకపోతే మా పోరాటం తప్పదు అని ఆవేదనతో హెచ్చరిస్తున్నారు.