Listen to this article

జనం న్యూస్, జూన్ 17 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి లో సోమవారం బీజేపీ ఓబీసీ మోర్చ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 11 సంవత్సరాల నరేంద్ర మోడీ, పరిపాలన గురించి ప్రజలకు వివరించే రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా హాజరైన బీజేపీ ఓబీసీ మోర్చ గీతా సెల్ రాష్ట్ర కో కన్వీనర్, సిద్దిపేట జిల్లా ఓబీసీ ఇంచార్జ్ రాగుల కిరణ్ కుమార్ గౌడ్,సిద్దిపేట జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి గర్నేపల్లి కృష్ణమూర్తి,ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత దేశం బీజేపీ ప్రభుత్వ పాలనలో పురోగమిస్తుందని,బీజేపీ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించే రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, రాబోయే స్తానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జయ కేతనం ఎగురవేస్తుందని, ధీమా వ్యక్తం చేశారు, బీజేపీ ద్వారానే ప్రజా సంక్షేమ పాలన సాధ్యమని భారత దేశం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రపంచ దేశాల సరసన నిలిచే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తిరుపతి, ఈశ్వర్ , చంద్రం,బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు