

(జనం న్యూస్ చంటి జూన్ 16)
భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత ప్రధాని అయ్యారు. ప్రజల ప్రాథమిక హక్కులను ముఖ్యం గా జీవించే హక్కును పరిరక్షించే బాధ్యత మీ పై ఉంది.ప్రొణం ఎంతో విలువైనది ఒకసారి మనిషి ప్రాణం పోతే మళ్ళీ రాదు. కొంతకాలం క్రితం అమిత్ షా హోంశాఖ మంత్రి 2026 మార్చి నాటికి మనదేశంలో నక్సలిజం (నక్సలైట్లు) లేకుండా చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకటనను మీరు సమర్థిస్తున్నట్లు మీ తదుపరి మాటల ద్వారా స్పష్టమైనది. యువత జీవితాలను నష్టపరుస్తున్న డ్రగ్స్ ను లేదా మత్తు పదార్థాలను ఒక కాల పరిమితిలో నిర్మూలిస్తామని లేదా విదేశాలలో ఉన్న 80 లక్షల కోట్ల నల్లధనాన్ని తిరిగి తీసుకొనివస్తామని ప్రకటించినా లేదా వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తామని చెప్పినా, నదుల కాలుష్యాన్ని తొలగించి శుభ్రపరుస్తామని చెప్పినా, మహిళలు మీద అత్యాచారాలు జరగకుండా చూస్తామని చెప్పినా ,బాల కార్మికులు లేకుండా చూస్తామని చెప్పినా,నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని చెప్పినా ,రైతుల ఆత్మహత్యలు జరగకుండా ఉండే పరిస్థితి కల్పిస్తామని చెప్పినా, రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తామని చెప్పినా , అందరికీ ఉచిత విద్య ,ఉచిత వైద్యం అందిస్తామని చెప్పినా, లేదా భూమిలేని రైతు కుటుంబాలకు భూమి ఇస్తామని చెప్పినా,వలస లేదా ఔట్ సోర్సింగ్ , కాంట్రాక్టు కార్మికులు సమస్యలు మార్ఛి 2026 లేదా 2027 వరకు పరిష్కరిస్తామని చెప్పినా,లేదా ప్రజల జీవితాలు మెరుగు పరిచే ఎ కార్యక్రమాన్నయినా ఒక కాల పరిమితి లో పరిష్కరిస్తామని చెప్పినొ భారత ప్రజలు ఎంతో సంతోషించేవారు. నేటికీ ఎంతోమంది ప్రజలు పేదరికంతో బాధపడుతున్నారు. పేదరిక నిర్మూలనకు ఒక గడువు మీరు నిర్ణయించిన అది భారత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది .లేదా ఆదివాసి ప్రాంతాలలో అభివృద్ధిని చేపడతామని చెప్పిన వారికి విద్యా వైద్య సౌకర్యాలు కల్పిస్తామని చెప్పిన ప్రజలంతా సంతోషించేవారు .కానీ నక్సలిజం 2026 మార్చినాటికి నిర్మలిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు ఉన్నాయని కొన్ని కార్పొరేట్ కంపెనీలకు గిరిజన ప్రాంతాల్లోని ఖనిజాలను అప్పగించాలనే ఆలోచన ఉందని అనేకమంది ఆరోపిస్తున్నారు .ఈ ఆరోపణలు తప్పని కూడా మీ నుంచి ప్రకటన వచ్చినట్లు నేను చూడలేదు .ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్ల నిర్మూలన చేపట్టారు అడవుల్లో లోనికి వేలాదిమంది పారామిలటరీ దళాలను పంపి కోంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. గత సంవత్సర కాలంగా దాదాపు 500 మందికి పైగా చనిపోవడం జరిగింది .కొంత మంది మావోయిస్టులతో పాటు అనేకమంది అమాయకులైన ఆదివాసీలు కూడా చనిపోయినట్లు వార్తలు వచ్చాయి .అదే విధంగా కొంతమంది పోలీస్ అధికారులు ఒక ఎసిపి గారు ,ముగ్గురు గ్రేహౌండ్ పోలీసులు చనిపోయారని మరి ఇద్దరు ముగ్గురు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారని వార్తలు వచ్చాయి. ఇలాగే గతంలో అనేకమంది చని పోవడం చూసి మేము కొంతమందిని కలిసి శాంతి చర్చల కమిటీని ఏర్పాటు చేసి మార్చి 24 రోజు ఒక ప్రకటన విడుదల చేశాం. ఇటు కేంద్ర ప్రభుత్వం అటు మావోయిస్టులు చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని ఈలోగా ఇరుపక్షాల వారు కాల్పుల విరమణ పాటించాలని కోరాం. దీనికి మావోయిస్టులు స్పందించి మార్చి 28 ,2025 నాడు ఒక బహిరంగ ప్రకటన చేశారు.” మేము చర్చలకు సిద్ధమని , కాల్పుల విరమణ పాటిస్తామని, చర్చలకు అనుకూలమైన వాతావరణ కల్పించి కోంబింగ్ ఆపరేషన్స్ నిలిపివేయాలని వారు కోరారు. మేము మా శాంతి చర్చలు కమీటి వైపు నుండి తమరికి ,హోంశాఖా మంత్రికి మెమోరాండాలు పంపాము. పత్రికా ప్రకటనలు ద్వారా తెలిపాము. ఎంతోమంది మేధావులు, ఎంతో మంది ప్రజలు ప్రభుత్వం మావోయిస్టుల తో చర్చలు జరపాలని కోరుతు సభలు సమావేశాలు నిర్వహించారు .కాని ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. పైగా కోంబింగ్ ఆపరేషన్లు మరింత ఉధృతం చేశారు. దాదాపు 35,000 మంది పారమిలట్రీ దళాలతో కర్రెగుట్టలు చత్తీస్గడ్ తెలంగాణ బార్డర్ లోని అడవుల్లో కొంబింగ్ ఆపరేషన్స్ కొనసాగించారు. ప్రజలను పత్రికలు వారిని ఎవ్వరినీ అనుమతించడం లేదు .అక్కడ ఏమి జరుగుతుందో ప్రభుత్వం చెపితే తప్ప ప్రజలకు తెలిసే అవకాశం లేదు .గత మూడు నాలుగు నెలల్లో 50 మంది పైగా చనిపోవడం జరిగింది .చనిపోయిన ఆదివాసీలు ఉన్నట్లు మరియు పైన కొంతమంది పోలీసులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇటువంటి మరణాలను ప్రభుత్వం నివారించి ఉండవలసింది. ప్రభుత్వం నక్సలైట్ల ప్రకటన మేరకు వారిని చర్చలకు పిలిచినట్లయితే తదుపరి మరణాలు జరిగేవి కావని మేం భావిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం గతంలో సాయుధులైన అనేక సంస్థలతో చర్చలు జరిపి శాంతి ఒప్పందాలు చేసుకున్నారు . ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ తో నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర తో 2024లో, కబ్రి ఉగ్రవాదులతో 2021లో, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ తో 2024లో ,ఆదివాసి ఇన్సర్జెంట్ గ్రూప్స్ తో 2023లో, దిమ్సా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ తో 2023 లో,నేషనల్ లైబరేషన్ ఫ్రంట్ తో 2023లో, మిజో నేషనల్ ఫ్రంట్ తో 1996లో శాంతి ఒప్పందాలు చేసుకుని మంచి ఫలితాలను సాధించడం జరిగింది. పై సాయుధ సంస్థలతో శాంతి ఒప్పందాలు చేసుకున్నట్లే మావోయిస్టులతో కూడా శాంతి ఒప్పందాలు చేసుకొని ఉండవలసింది. మరోవైపు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ తో చర్చలు జరిపి శాంతి ఒప్పందం చేసికున్నారే కానీ మావోయిస్టుల విషయంలో ప్రభుత్వం మరోవైఖిరిని అవలంబించడానికి గల కారణాలేమిటో తెలియకున్నవి. ట్రంప్ లాంటి వారు చెపితే తప్ప మావోయిస్టుల తో చర్చించరా అని కొందరు ప్రజలు భావిస్తున్నారు.ఇటీవలి కాలంలో జరిగిన కాల్పులలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంభాల కేశవరావు ఇలియాస్ బసవరాజ్ మరి 27 మంది ఇతరులు ఒకేరోజు చనిపోవడం జరిగింది. విచారకరమైన విషయం ఏమి టంటే వారి శరీరాలను సైతం వారి బంధువులకు అప్పగించలేదు .కారణాలేంటో తెలియడం లేదు హిందూ సంప్రదాయాల ప్రకారం చనిపోయిన వారి శవాలకు దహన సంస్కారాలను వారి కుటుంబ సభ్యులు నిర్వహించాలి. ఇటువంటి హిందూ మత విశ్వాసాలను, సాంప్రదాయాలను ప్రభుత్వం ఎందుకు నిరాకరించినదో అర్థం కావడం లేదు.. కొంత మంది మావోయిస్టులను సజీవంగా పట్టుకొని చిత్రహింసలు చేశారని ,వారి శవాలను బంధువులకు ఇస్తే చనిపోయిన వారి శరీరాలు పై ఉన్న గాయాలు కనబడతాయని, చేసిన నేరాలు బయట పడకుండా ఉండడానికి శవాలను అప్పగించ లేదని ప్రజలు భావిస్తున్నారు. సజీవంగా పట్టుకొని కాల్చి చంపడానికి కారణం బహుశా మావోయిస్టులు వద్ద దదొరికిన డబ్బు వివరాలు బయట పడతాయని కావచ్చునని ప్రజలు భావిస్తున్నారు. ఎప్పుడయితే నక్సలైట్ల ప్రధాన స్థావారాలన్ని పారా మిలటరీ దళాలు స్వాధీనం చేసుకున్నారో అక్కడ ఎంతో డబ్బు దొరికిందో ఇంత వరకు చెప్ప లేదు .కనీసం శవాలు మీద నున్న రిస్ట్ వాచీలు కూడా బంధువులకు ఇవ్వు లేదు. ఏ వస్తువులు దొరికావో ఆ వివరాలు చెప్పలేదు .చేసిన నేరాలను కప్పిపుచ్చుకోవడానికి సాధారణ నేరస్తులు సాక్ష్యాధారాలు లేకుండా చేస్తారు .అదే ఇక్కడ జరిగిందని ప్రజలు భావిస్తున్నారు . సాక్ష్యాధారాలు లేకుండా చేశారంటే నే నేరం జరిగిందనే భావనకు ఆధారాలు ఉన్నట్లేనని అర్థం..ప్రభుత్వం తీరు, ప్రజల అనుమానాలను బలపరిచే విధంగా ఉంది. మరో తీవ్రమైన విషయమేమంటే మావోయిస్టులు చనిపోయారని సంతోషంతో నృత్యాలు చేయడం వికృత చేష్టలు గా ప్రజలు భావిస్తున్నారు మావోయిస్టు కార్యదర్శిని చంపడం ఘనకార్య మని ,గర్వకారణమని తమరు హోంశాఖ మంత్రివర్యులు ప్రకటించడం ఆశ్చర్యకరంగా ఉంది .ఏదో విదేశాన్ని గెలిచినట్టు లేదా విదేశాలు ఆక్రమించిన ఏదో కొంత భూమిని తిరిగి సంపాదించి నట్టు, మన దేశస్తులు, పేదల కోసం పోరాడే వారిని, నిస్వార్థ నాయకులను చంపి పండుగ చేసి కోవడం చాలా ఘోరం . మానవత్వానికి ఏ మచ్చ.ఎప్పుడైతే మావోయిస్టులు మేము చర్చలకు వస్తామని చెప్పారో ప్రభుత్వం సావధానంగా ఆలోచించి వారికి ఒక అవకాశం కల్పించి ఉండాల్సింది ..వారు చర్చలకు వచ్చినప్పుడు ప్రభుత్వం చెప్పవలసిన కండిషన్స్ చెప్పి వారిని ఒప్పించే ప్రయత్నం చేయవలసింది .ఆయుధాలు విసర్జించే విషయం , సాయుధ పోరాట విరమణ చర్చించి వారిని ఒప్పించాల్సి చేసి ఉండే .అదే విధంగా వారి డిమాండ్స్ ఏమిటో పరిశీలించి అవి ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే వాటిని కూడా ప్రభుత్వం సావధానంగా పరిష్కరిస్తామని చెప్పి ఉన్నట్లయితే ఎప్పటినుంచో ఉన్న సమస్య దాదాపు 50 సంవత్సరాలు నుంచి ఉన్న సమస్యకు ఒక పరిష్కారం లభించేది. తద్వారా ఆదివాసి ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం ఏర్పడేది .
ఇక ప్రభుత్వం మేము నక్సలైట్ల నిర్మూలనకు పూను కొన్నది ఆదివాసీల అభివృద్ధి కొరకని చెప్తున్నది .అయితే నక్సలైట్లు లేని ఆదివాసి ప్రాంతాల్లో ప్రభుత్వం అక్కడి ప్రజలకు తగిన సౌకర్యాలు కల్పించిందా వారికి విద్య వైద్య సదుపాయాలు కల్పించారా మరి మిగతా ప్రాంతాల్లో కల్పించనప్పుడు ప్రభుత్వం చెబుతున్న వాదన ఏ మాత్రం సమంజసంగా కనిపించడం లేదు.ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మావోయిస్టులను చర్చలకు పిలిచి శాంతియుత చర్చలు జయప్రదం చేయాలని కోరుచున్నాము. ప్రాణం ఎవరిదైనా ఒకటే ప్రాణం. పోతే తిరిగి రాదు ఒక మావోయిస్టు చనిపోయిన ఒక పోలీసు చనిపోయిన ఒక అమాయకులడైన ఆదివాసి చనిపోయిన ఎవరినదైనా ప్రాణం ఒకటే. మేము ఏ ఒక్కరి ప్రాణం పోవద్దని కోరుకుంటున్నాం .కాబట్టే శాంతి చర్చలు జరపాలని కోరుచున్నాము శాంతి చర్చలు పలప్రదమైనట్లయితే దాదాపు 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది . మావోయిస్టులు కూడా ప్రజా జీవితంలోకి వచ్చి సామాన్య ప్రజలను చైతన్యవంతులను చేసి వారి సమస్యల పరిష్కారానికి శాంతియుత పోరాటాలు జరపవచ్చు .ఇటు కార్మికులకు అటు పేద రైతులకు, ఆదివాసీలకు దళితులకు మరిన్ని హక్కులు సాధించడానికి ప్రజల్ని రాజకీయంగా చైతన్యవంతులను చేయడానికి మావోయిస్టులు పూనకోవచ్చు .తద్వారా సమాజంలో మంచి మార్పులు రావడానికి, మంచి ప్రభుత్వాలు ఏర్పడడానికి అవకాశం కలగవచ్చు .ఇటువంటి సువర్ణ అవకాశాలని ఇటు ప్రభుత్వం అటు నక్సలైట్లు వదులుకోవడం సరి అయింది కాదని మేము భావిస్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ వారు, టిడిపి వారు లేదా మరికొందరు చర్చల కోసం ప్రయత్నించినప్పటికీ అవి సఫలం కాలేదు. కానీ ఈసారి చర్చలు జరిపి చర్చలు ఫలవంతమైతే అయితే దానివలన మీకు మీ పార్టీకి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం .
ఇప్పుడు ప్రభుత్వం గత భావాలకు ఆలోచనలకు ప్రకటనలకు పరిమితం కాకుండా రేపటి గురించి ఆశాజనకంగా ఆలోచించి , మానవత్వంతో కూడిన ఆలోచన చేసినట్లయితే సమాజానికి మేలు జరుగుతుంది.శాశ్విత శాంతియుత పరిష్కారాల కొరకు చేయవలసిన ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించో మావోయిస్టులను చర్చిలకు పిలువాలని కోరుచున్నాము .మేము కూడా చర్ ఇటు ప్రభుత్వానికి అటు మావోయిస్టులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఏదైనా విషయంలో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు మాలాంటి వారి యొక్క సలహాలు కూడా తీసుకోవచ్చు. మావోయిస్టులు కూడా మా సలహాలు పరిగణలోకి తీసుకుంటారని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మరియు మావోయిస్టు పార్టీకి విజ్ఞప్తి చేశారు ముత్యాల నరసింహులు మాట్లాడుతూ బౌధిస్ట్ సొసైట్ ఆఫ్ ఇండియా, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మేము ఆశిస్తున్నాం.