

ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్
జనం న్యూస్ 17జూన్ పెగడపల్లి ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు ప్రజా పాలనలో భాగంగా జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని పెగడపల్లి, నంచర్లలో నడుస్తున్న భూభారతి కార్యక్రమంలో ఈరోజు పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ పాల్గొన్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతులకు భూ సమస్యలు లేకుండా సంతోషంగా చూడడమే రేవంత్ రెడ్డి సర్కార్ లక్ష్యం అని పేర్కొన్నారు.భూ సమస్యలతో సతమతమవుతున్న రైతులకు భూ భారతి తో మేలు జరుగుతుందనిఅన్ని గ్రామాలలో నుండి పూర్తిగా దరఖాస్తుల స్వీకరణ అనంతరం రెవెన్యూ అధికారులు మోకపైకి వచ్చి పరిశీలించి భూ సమస్యలు భూ సమస్యలు పరిష్కరించి
రైతులకు ఎలాంటి భూ సమస్యలు లేకుండా చేయడమే ప్రభుత్వ ధ్యేయమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రవీందర్ డిప్యూటీ తాసిల్దార్ లాస్య శ్రీ ఆర్ ఐ లు శ్రీనివాస్ జమున సీనియర్ అసిస్టెంట్ ఆంజనేయులురెవెన్యూసిబ్బందితో పాటుకాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరుగల శ్రీనివాస్ శ్యాంసుందర్ రెడ్డి దీకొండ మహేందర్ కొత్తూరు విష్ణు కుంటాల బాబు నీరటి రాజ్ కుమార్ సాయిళ్ళ రాకేష్ ఏలుపుల రిషేందర్ పలువురు నాయకులు పాల్గొన్నారు.