

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా తోడుపడాలి
కార్పొరేటు, ప్రైవేటు అనుమతులేని పాఠశాలలపై చర్యలు చేపట్టాలి
ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడిని నియంత్రించాలి!!
.జగజంపుల తిరుపతి, పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి
జనం న్యూస్ 16 జూన్. కొమురం భీమ్ జిల్లా(ఆసిఫాబాద్). డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.
కొమురంభీం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో *గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రే కు పిడిఎస్యు ఆధ్వర్యంలో పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది వారు పేర్కొన్నారు ఈ సందర్బంగా పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి మాట్లాడుతూ. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అద్వానంగా ఉన్నది. తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా కార్యక్రమాలను రూపొందించాలని కోరారు. విద్యార్థులు లేరనే సాకుతో దాదాపుగా రెండు వేల మూసివేత కు గురవుతున్న పాఠశాలలకు లోతైన పరిశీలన చేసి మూసివేత గురికాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోపక్క ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా వెలిశాయనీ తమ ఇష్టానుసారం ఫీజులు దండుకుంటూ అంగు ఆర్భాటాలు చూపించే విధంగా పాంప్లెట్లు పట్టుకొని గ్రామాలపై దండయాత్ర వలె అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారనీ, అయిన ఉన్నత అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఉన్నత అధికారులు ఫీజుల దోపిడిని నియంత్రించి కార్పొరేటు, ప్రైవేటు అనుమతులేని పాఠశాలలపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వివిధ రకాలుగా టై, బెల్టు, బుక్స్ పేరుతో వసూలు చేస్తున్న జీరో దందాను నిలవరించాలని పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లల తల్లిదండ్రులను అధిక భారం నుండి బయటపడే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.అలాగే విద్యా హక్కు చట్టాన్ని అన్ని విద్యాసంస్థలలో పకడ్బందీగా అమలు చేయాలనీ, ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థలాల్లో పేద విద్యార్థులకు 25 శాతం ఉచితంగా చదువు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని యెడల జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా సహాయ కార్యదర్శి పెందూర్ నితిన్, జిల్లా కోశాధికారి గోలేటి ప్రదీప్,నాయకులు షేక్ సమీర్, హరీష్ లు పాల్గొన్నారు.