

జనం న్యూస్ : 16 జూన్ సోమవారం
సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; ఫాదర్స్ డే సందర్భంగా సిద్దిపేట పట్టణంలో శివాజీ నగర్ లోని బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో పితృ దినోత్సవ వేడుకలను నిర్వహించారు, ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ సి.హెచ్ .ఉదయ్ కుమార్ సంస్థ నిర్వాహకురాలు బి కే భవానికి పుష్పగుచ్చాన్ని అందజేసి అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు, అనంతరం సంస్థ నిర్వాహకురాలు మాట్లాడుతూ తల్లిదండ్రులను గౌరవిస్తూ, పూజించే సంస్కృతి మన భారత దేశంలోనే ఉంది, ఎక్కడో పాశ్చాత్య దేశాలలో జరుపుకునే ఫాదర్స్ డే లు ఇప్పుడు భారతదేశపు దాకా వచ్చాయి అంటే ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రుల పట్ల అనుబంధాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు, కనీస బాధ్యతను నిర్వహించకుండా, నువ్వు నాకేం ఇచ్చావు, ఏం చేశావు అని నిలదీసే పిల్లలు ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్లకు తెలియదు వాళ్ల తండ్రి ఎంతో కష్టపడి వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చారు అని, తండ్రి ఎప్పుడూ కూడా తను చేసింది ఎవరికి చెప్పడు, తనకొచ్చే పరిస్థితులను, బాధలను తన గుండెల్లోనే దాచుకొని పిల్లల ముందు హీరో లాగా ఉంటాడు, వారికి కావాల్సినవన్నీ అందిస్తాడు అలాంటి తండ్రిని గౌరవించడమే మనం వారికి ఇచ్చే విలువైన బహుమతి అని, ఈ తరం వారికి మానవ సంబంధాల యొక్క విలువని తెలియజేసే బాధ్యత పెద్ద వాళ్ళదే కాబట్టి అందరం కలిసి అంతరించిపోతున్న మానవ సంబంధాలను నిలపడానికి కృషి చేద్దాము అని తెలియజేస్తూ సంస్థకు వచ్చే తండ్రులందరితో కలిసి కేక్ కట్ చేసి ఫాదర్స్ డే వేడుకలను నిర్వహించారు అనంతరం సంస్థ సభ్యులందరూ కలిసి చిన్న చిన్న ఆటలు ఆడుతూ ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సంస్థ ప్రతినిధులు బి కే స్వప్న బికేస్ స్రవంతి సంస్థ సభ్యులు డాక్టర్ సిహెచ్ ఉదయ్ కుమార్ ఓంకార్ బిందు పద్మ వెంకటేష్ ఆంజనేయ చారి తదితరులు పాల్గొన్నారు.