

జనం న్యూస్- జూన్ 16 – నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ చేపట్టి వంద రోజుల ప్రణాళికను రూపొందించి అమలు చేస్తుంటే నందికొండ మున్సిపాలిటీలో మాత్రం అటువంటి చర్యలు శూన్యం, డ్రైనేజీల్లో పూడికతీత పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు వార్డులలో అధికారులు పర్యటించాలన్న నిబంధనలు ఏమాత్రం పాటించని మున్సిపాలిటీ అధికారులు, మున్సిపాలిటీలో తడి, పొడి చెత్త వేరు చేసే విధానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న విషయం కాగితాలకే పరిమితం, ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం తొలగించడంతోపాటు పిచ్చి మొక్కలు తొలగించాలన్న నిబంధనలను గాలికి వదిలిన అధికారులు, వర్షాకాలం ప్రారంభమై సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్న చెత్త కుండీల వద్ద బ్లీచింగ్ పౌడర్ చల్లటం మరచిన అధికారులు, చెత్త సేకరణ వాహనాలు సైతం రెండు రోజులకు ఒకసారి వార్డులలోకి వస్తున్న వైనం. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఎక్కడి చెత్త అక్కడే చందంగా మారింది, పారిశుద్ధ్య కార్మికులు సైతం రోడ్ల వెంట ఎక్కడ చెత్తను అక్కడే తగలబెడుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు సైతం మూడు నెలలుగా జీతాలు రాకపోవడం, కౌన్సిలర్ల కాలపరిమితి ముగియటంతో అజమాయిషి చేసేవారు లేక వార్డులలో పట్టించుకునే నాధుడే లేడు, మున్సిపల్ అధికారులు ఏ రోజు వార్డులలోకి వచ్చి పర్యవేక్షించిన దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వార్డులలో రోడ్ల వెంట ఉన్న చెత్తను రోజు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని, రోజు ఇంటి ముందుకు చెత్త సేకరణ బండి వచ్చే విధంగా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలకు కోరుతున్నారు.