Listen to this article

జనం న్యూస్: 16 జూన్ సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;

చిన్నకోడూర్ మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిని సన్మానించిన మండల పార్టీ అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ చిన్నకోడూరు మండల కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలిగా నూతనంగా నియమకమైన చెర్లంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సింగిరాల లక్ష్మి నీ చిన్నకోడూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పార్టీ క్లిష్ట పరిస్థితిలో పార్టీకోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు సరైన సమయంలో గుర్తింపు దక్కుతుందన్నారు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీలు మరియు కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయాలనే ముఖ్యమంత్రి సంకల్పన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లి వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్షంగా పనిచేయాలని సూచించారు ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన సింగిరాల లక్ష్మి మాట్లాడుతూ తన నియామకానికి సహాకరించిన నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పూజల హరికృష్ణకి జిల్లా మహిళ అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి , చిన్నకోడూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలియజేసారు ఈ కార్యక్రమం లో మండల ఉపాధ్యక్షులు సందబోయిన పర్షరాం,వికలాంగుల విభాగం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింగిరాల రాజు, sc సెల్ జిల్లా కన్వీనర్ పొన్నాల రాజేష్, మండల కన్వీనర్ కొమ్ము ప్రశాంత్, యూత్ కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు ఉడుత జయంత్, ఎస్సీ సెల్ మాజీ మండల అధ్యక్షులు నముండ్ల వినోద్,నాయకులు జక్కుల నాగరాజు,ద్యావ రమేష్ తదితరులు పాల్గొన్నారు.