

జనం న్యూస్ జూన్ 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
రైతుల మేలు కోసమే ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమం అమలు చేస్తుందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం మునగాల మండల పరిధిలోని ఆకుపాముల రైతు వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల రైతుల కోసం సంక్షేమాలు అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్టీవో సూర్యనారాయణ, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో మునగాల మండల స్పెషల్ ఆఫీసర్ శిరీష, కోదాడ ఏడిఏ ఎల్లయ్య, మునగాల ఎంఏఓ రాజు, ఏఈఓ రేష్మ తదితరులు పాల్గొన్నారు.
