Listen to this article

జనం న్యూస్ జూన్ 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

జిల్లా కేంద్రంలోని వాంకిడి మండలం కిరిడీ గ్రామంలో గల ఎస్టి వాడలో నానవేణి రాజయ్య గల్లీలో గల బోర్ వెల్ గత కొద్ది రోజులుగా పాడైపోవడంతో గల్లీలో గల నిరుపేద కుటుంబాలు నీటి సమస్యతో రోజులు వెళ్లదీస్తున్న వైనం స్థానిక ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పరిష్కారం కాని సమస్యపై మండల ఎంపీడీవోకు తమ నీటి సమస్యను తీర్చాలని వినతి పత్రం సమర్పించిన ఖిరిడి గ్రామపంచాయతీ ఎస్టీ వాడ స్థానికులు వీరికి సంఘీభావంగా తెలంగాణ రేణుక ఎల్లమ్మ గౌడ చైతన్య ఐక్య సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బైరగోని సతీష్ గౌడ్ సందర్భంగా మాట్లాడుతూ కిరిడీ గ్రామంలో గల బోర్వెల్ ను తక్షణమే ఉన్నతాధికారులు పర్యవేక్షించి అక్కడున్నటువంటి సమస్యను తక్షణమే పరిష్కరించి ఆ నిరుపేద కుటుంబాలకు తాగునీరు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కార్యక్రమంలో నానివేణి లక్ష్మి రేగళ్ల వెంకటేష్ నాగోసే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు