

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 16 రిపోర్టర్ సలికినీడి నాగు
మాజీ మంత్రి వర్యులు,పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు విడదల రజిని
జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం”పుస్తకావిష్కరణ
గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నేతలు సూపర్ సిక్స్ తో పాటు 180కి పైగా హామీలిచ్చి ప్రజలను అన్ని విధాలా మోసం చేశారని మాజీ మంత్రి వర్యులు విడదల రజిని అన్నారు.సీఎం చంద్రబాబు ఏడాది పాలనపై పార్టీ రూపొందించిన ‘జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం’ పుస్తకాన్ని ఈరోజు చిలకలూరిపేట పట్టణంలోని ఆమె నివాసంలో పార్టీ నేతలతో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ,కూటమి ఏడాది పాలలో అభివృద్ధి చేయకపోగా,వారు చేసిన మోసాలను,అరాచకాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టారని చెప్పారు.కూటమి ఏడాది పాలనంతా విధ్వంసమేనని ధ్వజమెత్తారు.ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కూటమి ప్రభుత్వం అమలు చేయ లేదని విమర్శించారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారని,దీనికి సంబంధించిన వాస్తవాలు,ఆధారాలతో ఈ పుస్తకం రూపొందిందని చెప్పారు.మోసపు హామీలు, అబద్దపు మాటలతో మభ్యపెట్టి రాష్ట్ర ప్రజలకు ఏవిధంగా వెన్నుపోటు పాడిలారో ఈ పుస్తకంలో వివరించారని తెలిపారు.మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారని, దీనిలో చంద్రబాబు ఎన్ని మతలబులు పెడతారో వేచి చూడాలని అన్నారు.ఏ మెలికా పెట్టకుండా ఆయన ఏ ఒక్క పథకమూ అమలు చేయరని మాజీ మంత్రి విడదల రజిని ఎద్దేవా చేశారు.ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి,ఒక్కటి మాత్రమే ఇచ్చారని అన్నారు.గత ఏడాది ఇవ్వాల్సిన మరో రెండు సిలిండర్లు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు.18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు ప్రతి నెలా రూ.1,500 ఇస్తామన్న హామీ కూడా అమలు చేయ లేదన్నారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి వంటి హామీలను పక్కన పెట్టారన్నారు. గత ఏడాది ఎగ్గొట్టిన తల్లికి వందనం, రైతు భరోసా వంటివి కూడా చెల్లించాలని డిమాండ్ చేశాడు.లేకుంటే ప్రజల తరపున పోరాడతామని చెప్పారు.