Listen to this article

జనం న్యూస్ చంటి మే 19

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ముబారస్పూర్ గ్రామంలో ఈరోజు భూభారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎమ్మార్వో చంద్రశేఖర్ మాట్లాడుతూ రిజిస్టర్ కానీ భూములను భూభారతి రెవెన్యూ ప్రభుత్వ సదస్సులో సాదా బై నామాలు పెండింగ్లో ఉన్న భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మరియు లావాని పట్టాలు అన్ని రకముల భూ సమస్యలు దరఖాస్తుల ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ప్రభాకర్ నియర్ అసిస్టెంట్ రాజేశ్వర్. శ్రవణ్ కుమార్. సౌజన్య. ధరణి ఆపరేటర్ వెంకట్ రాజిరెడ్డి. సర్వేయర్ రమేష్. రెవెన్యూ అధికారులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.