Listen to this article

రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై ఉక్కు పాదం మోపాలి

పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించాలని పోలీస్ అధికారులకు సూచించిన ఎస్పీ

నెలవారీ నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపిఎస్

జనం న్యూస్ జూన్ 19 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో


ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపిఎస్ జిల్లా పోలీస్ కార్యాలయం లోని కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ…. ప్రతీ కేసులో ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులలో త్వరితగతిన ఇన్విస్టిగేషన్ పూర్తి చేయడంతో పాటు , బాధితులకు త్వరితగతిన కంపెన్సేషన్ (పరిహారం) వచ్చేలా చూడాలని అన్నారు. పెట్రోలింగ్,బ్లూ కోల్ట్స్ వాహనాలతో అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ గస్తీ నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్ధాలు, మట్కా, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా హాట్ స్పాట్స్ ను గుర్తించి గంజాయిని రవాణా చేసే వ్యక్తులతో పాటు గంజాయిని సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించి తమ తమ నివాస ప్రాంతాల్లో మరియు వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చేయాలని తెలిపారు. ప్రాపర్టీ కేసుల్లో ప్రస్తుతం పోలీసు శాఖ వినియోగిస్తున్న సాంకేతికతను ఉపయోగించి నేరస్తులను పట్టుకుని సొత్తును రికవరీ చేసి భాదితులకు త్వరతగతిన అందేలా చూడాలని తెలిపారు. వర్షాకాలంలో అధిక వర్షాలు సంభవించినపుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసే విధంగా ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలను నడుపుతూ, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారి గురించి నిరంతరం వాహన తనిఖీలు చేపట్టి పట్టుబడిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి(బ్లాక్ స్పాట్స్) వాటి నివారణకై సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని తెలిపారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో కాగజ్ నగర్ డిఎస్పి రామానుజం, డీసీఆర్బీ డిఎస్పీ విష్ణు మూర్తి , జిల్లాలోని సర్కిల్ ఇన్స్పెక్టర్స్,ఆర్.ఐ లు, సబ్ ఇన్స్పెక్టర్స్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.