Listen to this article

జనం న్యూస్ 22 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయకవేపాడ మండలంలో కరకవలస పంచాయతీ గిరి శిఖరంపై నివాసముంటున్న మారిక గ్రామ గిరిజన పిల్లలకు నేటికీ చెట్టుకింద విద్యాబోధన అందించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రార్ధన మందిరంలో మధ్యాహ్న భోజనాలు పెడుతున్నారు. ఈ పాఠశాలలో 27 మంది పిల్లలు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ పక్కా భవనంకు స్థలం సమకూర్చకపోవడంతో నిధులు ఉన్న భవన నిర్మాణం చేపట్టలేని పరిస్థితి ఉందని గిరిజనుల వాపోతున్నారు. సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.