Listen to this article

జనం న్యూస్ 29 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయకవిజయనగరం ఉగ్రదాడి అనుమానితుల కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మినిస్ట్రీ ఆప్‌ హోం ఎఫైర్స్‌ నుంచి అనుమతి తీసుకుంది. NIA కేసు అప్పగించేందుకు విజయనగరం 2 టౌన్‌ పోలీసులు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. విశాఖ సెంట్రల్‌ జైలులో ఉగ్రదాడి కేసులో అనుమానితులు సిరాజ్‌, సమీర్‌ ప్రస్తుతం రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. ఉగ్రదాడి కావడంతో మరింత లోతైన దర్యాప్తు కోసం తాజాగా NIA చేతిలోకి తీసుకుంది.