Listen to this article

జనం న్యూస్ 30 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

ఎన్నికల ముందు ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి విమర్శించారు. ఏడాది పాలనలో ప్రజా ప్రయోజనాలు కోసం పని చేయలేదని ఆరోపించారు. కేవలం వైసీపీ నేతలను అరెస్ట్‌ చేసి పార్టీ కేడర్‌ను భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలే చేశారని మండిపడ్డారు.