

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జూన్ 30
తర్లుపాడు మండల కేంద్రం నుండి తుమ్మలచెరువు వెళ్లే రహదారి ముల్లకంపలతో ఇరువైపులా అల్లుకొని ఉంది. ప్రతినిత్యం ఈ దారిలో ఎంతోమంది ప్రయాణిస్తున్నారుఅంతేకాకుండా రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన తుమ్మలచెరువు గ్రామం లో గల ఈద్గా వద్ద కు మొహరం నాడు వేల సంఖ్యలో వస్తుంటారు మొహరం కూడా దగ్గరలో ఉండటం తో దారిన వెళ్లే ప్రయాణికులు భక్తులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు చెట్లను సేవా దృక్పధం లో ఎప్పుడు ముందు ఉండే కశెట్టి జగన్ చెట్లను తొలగించారు వాహనాలు దగ్గరకు వచ్చేదాకా ఎదురుగా ఏమి వచ్చేది కనబడక ఎన్నో ప్రమాదాలు జరిగాయని గ్రహించిన జగన్నాధపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సామాజిక కార్యకర్త అయినటువంటి కశ్శెట్టి. జగన్ బాబు నాకెందుకులే అనుకోకుండా సామాజిక బాధ్యతగా తన సొంత నిధులతో జెసిబి సహాయంతో ఎనిమిది కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపులా ఉన్న చిల్లకంపను తొలగించడం జరిగినది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తమ వంతు సహకారంతో ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని జగన్ బాబు కోరారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్ ని పలువురు అభినందించారు
