

జనం న్యూస్ జూలై 01 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
సమాజంలో ఎవరి హక్కులకూ భంగం కల్గించొద్దని మునగాల మండల తహశీల్దార్ రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..పౌర హక్కులకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.కుల వివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించాలని,అన్ని కులాలు,వర్గాల వారు సోదరభావంతో మెలగాలని సూచించారు.కులమతాలకు అతీతంగా కలిసి ఉంటేనే పౌరహక్కులను సమా నంగా అందరూ అనుభవిస్తారని అన్నారు.ప్రజల రక్షణ కోసమే చట్టాలు ఉన్నాయని తెలిపారు.పౌరులు తమ హక్కులను కాపాడుకోవాలని సూచించారు.రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు.పౌరులు తమ హక్కులను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మునగాల మండల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, ఎస్సీ కార్పొరేషన్ మండల ప్రత్యేక అధికారి నాగేందర్, ఆర్ ఐ రామారావు, ఏపీవో శైలజ, గ్రామ పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.