

జనం న్యూస్ జూలై 01(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం వ్యవసాయ శాస్త్రవేత్తలతో,రైతులకు జరిగే శిక్షణ కార్యక్రమంలో భాగంగా జరిగే రైతు నేస్తం (వీడియో కాన్ఫరెన్స్) లో భాగంగా నేడు ఉదయం 10 గంటలకు రైతులకు వానాకాలం చిరుధాన్యాల సాగులో మెళుకవుల గురించి అవగాహన కార్యక్రమం మునగల మండల కేంద్రంలోని రైతు వేదిక, ఆకుపాముల రైతు వేదిక,రేపాల రైతు వేదికలలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు సోమవారం ఒక పత్రిక ప్రకటనలో మునగాల మండల వ్యవసాయ అధికారి రాజు తెలిపారు.ఈ అవగాహన కార్యక్రమానికి ఆయా గ్రామాల రైతులు పాల్గొని అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.