

జనం న్యూస్ జూన్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఆర్యవైశ్యులు రాజకీయంగా పైకి రావాలి. భారతదేశంలోనే ఆర్యవైశ్యులకు అత్యున్నత స్థానం కల్పించిన నాయకుడు నారా చంద్రబాబునాయుడు గారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కి పట్టు వస్త్రాలు సమర్పించిన ఘనత కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానిదే. రాబోయే రోజుల్లో పేద ఆర్యవైశ్యుల కోసం మరింత కృషి చేస్తాం.రాబోయే తమిళనాడు ఎలక్షన్స్ లో ఆర్యవైశ్యులకు దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలి. తమిళనాడులోని రాజకీయ పార్టీలు కూడా వారి మేనిఫెస్టోలో ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వాలి.పేద ఆర్యవైశ్యులు ఎక్కడున్న వారికి ఏ కష్టం ఉన్న నేను అండగా ఉంటానన్న డూండి రాకేష్ తమిళనాడులోని ఆర్యవైశ్యుల కోసం కృషి చేస్తున్న అరవిందన్ ,వినోద్ కుమార్ మరియు కృష్ణమూర్తులను అభినందించిన డూండి రాకేష్
