

జనం న్యూస్ 01 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లాలో పలు కార్పొరేట్ పాఠశాలలపై కలెక్టర్ అంబేడ్కర్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యా హక్కు చట్టం ప్రకారం సీట్లు కేటాయించని ఆరు కార్పోరేట్ స్కూల్స్ను సీజ్ చేయాలని ఆదేశించారు.
ఈ మేరకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్, భాష్యం, సన్, బిసెంట్ స్కూల్స్లో అధికారులు తనిఖిలు చేశారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన వసతులు, ఇతర మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు.