

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 10 రిపోర్టర్ సలికినీడి నాగు
ఒక మహిళ ఉద్యోగి గంగ భవాని చేసిన అవినీతి కుంభకోణం లో సస్పెండ్ అయిన ఉద్యోగులు ఈ విచారణ రోజు రోజుకి లేట్ అవుతుండడంతో ఉద్యోగుల పై సస్పెండ్ ఎత్తివేసిన మున్సిపల్ శాఖ వెంటనే విధుల్లో చేరాలని ఉద్యోగుల కు ఆదేశాలు సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ అయితే ఈ కుంభకోణం లో అవినీతి చేసిన మొత్తం నగదు ను ఈ సస్పెన్షన్ గురైన ఉద్యోగులు చెల్లించిన విషియం కూడా అందరికి తెలిసిందే పేట పురపాలక సంఘం సస్పెండ్ అయిన ఉద్యోగులను యధావిధిగా విధుల్లోకి చిలకలూరిపేట పురపాలక సంఘంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిని గంగాభవాని సృష్టించిన ఆర్థిక కుంభకోణంసంగతి తెలిసిందే.ఈ కుంభకోణానికి సంబంధించి పలువురు ఉద్యోగులను సస్పెండ్ చేయగా, వారిలో ఒకరిని తప్ప అందరిని విధుల్లోకి తిరిగి తీసుకున్నారు.అయితే, దీనిపై విచారణ మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉంది. ఈ సస్పెన్షన్ పర్వంలో మున్సిపల్ మేనేజర్గా పనిచేసిన విజయలక్ష్మికి మాత్రం ఇంకా ఎటువంటి ఉత్తర్వులు అందలేదు.