Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

గురువులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నందలూరు మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సూర్యనారాయణ అన్నారు. గురువారం నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో గురు పౌర్ణమి ని పురస్కరించుకొని మండల విద్యాశాఖ అధికారి అనంత కృష్ణ నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానో పాధ్యాయులు. కవి గంగనపల్లి వెంకటరమణ అలాగే అరవపల్లి మండల ప్రాథమిక పాఠశాల ప్రధానో పాధ్యాయురాలువరలక్ష్మి,ఉపాధ్యాయులు సుండు పల్లి వెంకటరమణ లను సర్పంచ్ జంబు సూర్య నారాయణ ఘనంగా సత్క రించారు.ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రద మైనదని తద్వారా ఎంతోమంది విద్యార్థులకు బంగారు బాట వేసే అవకాశాన్ని దేవుడు వారికి ఇచ్చిన వరమన్నారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల జీవితాల్లో కీలక బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. అలాంటి గురువులను గౌరవించే అదృష్టం తనకు లభించడం అదృష్టం అన్నారు. ఉపాధ్యాయుల మాట విన్న వారు ఎవరు చెడి పోలేదని సమాజంలో వారికి లభించే గౌరవం ఎనలేనిది అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు దేశం నాయకులు బెస్త సుబ్ర హ్మణ్యం స్కూల్ కమిటీ చైర్మన్ తిరుపాల్ రాంబాబు ఉపాధ్యా యుని ఉపాధ్యా యులు పాల్గొన్నారు.