Listen to this article

జనం న్యూస్, జూలై 15, చిలపల్లి గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు

సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం లోని, చిలపల్లి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్, శివయ్య సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తోటి ఉద్యోగస్తులు మరియు గ్రామస్తులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.