Listen to this article

జనం న్యూస్ 19జూలై. కొమురం భీమ్ జిల్లా (ఆసిఫాబాద్)

జైనూర్; మండల కేంద్రంలో పోలీసులు మీ కోసం అనే కార్యక్రమంలో భాగంగా వాలీబాల్ పోటీలు నిర్వహించారు, అందులో భాగంగా ముఖ్యతిథిగా పాల్గొన్న జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావ్ ముందుగా వాలీబాల్ పోటీలను ప్రారబించి,ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ యువత క్రీడలతో పాటు చదువులో రాణించాలని కోరారు, అదేవిధంగా యువత చెడువ్యాసనాలకు దూరంగా ఉండాలని ముఖ్యంగా గంజాయి,సైబర్ క్రైమ్ పై మరియు ఇపుడు ఉన్న పరిస్థితుల్లో యువత ఎక్కువగా గంజాయి బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుందన్నారు, గంజాయిని నిర్ములనే లక్ష్యంగా పోలీసులు యువతను కాపాడాలని ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమలతో పాటు వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరిగింది అని అన్నారు, ఒక్క సారి గంజాయికి అలవాటు పడితే జీవితం ఇక శూన్యం అని ముందుకు పోలేమన్నారు, అంతే కాకుండా ఆన్లైన్ మోసాలాపై అవగాహన పెంచుకోవాలని యువత చదువు దృష్టి సారించాలని సూచించారు, అదేవిధంగా పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించడం, మారుమూల ప్రాంతాల్లో యువత పై దృష్టి సరించడం చాలా మంచిదని తెలిపారు, అదేవిధంగా యువత క్రీడలతో పాటు చదువు పై దృష్టి సారించాలని ఇంక ఉన్నతస్థాయికి ఎదగాలని వాలీబాల్ పోటీలో గెలుపు ఓటములు సహజమే అని క్రీడలో గెలిచిన జట్టు జిల్లాస్థాయి, రాష్టస్తాయికి పోవాలనీ క్రీడాకారులను కోరారు,అదేవిధంగా పోలీసులు గ్రామస్థాయి క్రీడాకారుల కొరకు ప్రతి మండలస్తాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం చాలా మంచిదని పోలీసులను అభినందిచ్చారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ , సబ్ ఇన్స్పెక్టర్లు రవి కుమార్ ,గంగన్న నాయకులు కొమ్రం భీం మనుమడు కుమ్రం సోనెరావ్ సహకార చైర్మన్ హను పటే , గూస్సాడి బృందం నాయకులు కనక సుదర్శన్ ,అత్రం అనిల్ , హైదర్ , వాసీం కొడప సోనేరావ్ సోయం భీం రావ్ ఉపాద్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు కనక వెంకటేశ్వర్ ,అత్రం ధర్మారావు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు…🌱