Listen to this article

మద్నూర్ జులై 30 జనం న్యూస్

బుధవారం మద్నూర్ మండల పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గారు పెద్ద ఎక్లారా వద్ద గల గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి 2 లక్షలు మంజూరు చేశారు. వాటికి సంబంధించిన పనులు ప్రారంభించడానికి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి గారి ఆదేశాల మేరకు గురువారం మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్, పంచాయతీ రాజ్ ఏఈఈ, విద్యుత్ శాఖ ఏఈ, RWS ఏఈఈ మండల అధికారులతో కలిసి పరిశీలించారు.హాస్టల్ మెస్ వరకు విద్యుత్ స్తంభాల ఏర్పాటు, విద్యార్థులకు నీటి కొరత రాకుండా బోర్ వెల్ ఏర్పాటు, హాస్టల్ భద్రత సిబ్బంది కొరకు రూమ్ నిర్మాణం చేయుట వంటి పనులను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్ గారు తెలిపారు.