

జనం న్యూస్ 2ఆగస్టు కొమురం భీమ్ జిల్లా (ఆసిఫాబాద్ ). డిస్టిక్ట్ స్టాఫ్ఫర్.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్, ఆసిఫాబాద్ ఏఎస్పి చిత్తరంజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ సబ్ డివిజన్ కెరమెరి మండల్ మోడీ విలేజ్ లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో షీ టీం ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం ఇన్చార్జి ఏఎస్ఐ సునీత మాట్లాడుతూ…. విద్యార్థినులకు భద్రతా చట్టాలు, ఆపద సమయంలో ఎలా స్పందించాలి, డయల్ 100, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు, ఈవ్ టీసింగ్, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థినులు తమ హక్కులను తెలుసుకుని ధైర్యంగా ఉండాలని సూచించారు. విద్యార్థినిలు ఎవరైనా వేధింపులకు గురి అయినట్లయితే వెంటనే ఆసిఫాబాద్ షీ టీం నెంబర్ 8712670564, కాగజనగర్ షీ టీమ్ 8712670565 నెంబర్స్ కి సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారిని జి. ప్రవీణ మరియు ఉపాధ్యాయులు , షీ టీం సభ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
