

బేస్తవారిపేట ప్రతినిధి, ఆగష్టు 06 (జనం న్యూస్):
ఇటీవల నూతనంగా కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా పూనూరు భూపాల్ రెడ్డి ని కంభం మార్కెట్ యార్డ్ నందు మర్యాదపూర్వకంగా కలిసి దృశ్యాలువాతో సత్కరించి, పూలమాలతో శుభాకాంక్షలు తెలియజేసిన చెట్టిచెర్ల టీడీపీ నాయకులు.కంభం మార్కెట్ యార్డ్ నందు పూనూరు భూపాల్ రెడ్డి ని కలిసిన వారిలో ముఖ్యులు మాజీ సర్పంచ్, టీడీపీ నాయకులు తీగిరెడ్డి భూపాల్ రెడ్డి, చెట్టిచెర్ల గ్రామ టీడీపీ అధ్యక్షుడు ముంతల సర్వేశ్వర రెడ్డి, మాచర్ల భూపాల్ రెడ్డి, టీడీపీ యువ నాయకులు తిగిరెడ్డి అశోక్ రెడ్డి, విశ్వనాధ్ రెడ్డి, మొరార్జీ యాదవ్, తదితర నాయకులు పాల్గొన్నారు.