Listen to this article

ఎల్కతుర్తి మండల అధ్యక్షులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి.

జనం న్యూస్ 06 ఆగస్టు 2025(ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రిపోర్టర్)

ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ గ్రామం శ్రీ పశుపతినాథ్ దేవాలయంలో ఇందు జ్ఞాన వేదిక ప్రబోధా సేవా సమితి ఎల్కతుర్తి శాఖ తరపున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు విశ్వావసు నామ సంవత్సరం శ్రావణమాసం తేదీ 16–08–2025 శనివారం నుండి తేదీ 17–08–2025 ఆదివారం వరకు నిర్వహిస్తున్నామని ఈ వేడుకల కోసం అనుమతి ఇవ్వవలసిందిగా ఎల్కతుర్తి శాఖ అధ్యక్షులు ఆలయ అర్చకులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి కోరారు.శ్రీకృష్ణ జన్మాష్టమి కరపత్రములను ఎస్సై ఏ ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించి అనుమతి అందించి వేడుకలకు తప్పకుండా హాజరవుతామని తెలియజేశారు.దేవదేవుడైన జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ జన్మాష్టమి వేడుకలు ఊరు ఎరిగింపు పల్లకి సేవ కార్యక్రమాలు పూర్వకాలంలో 11 రోజులు వేడుకలుగా ఉండేవని కాలక్రమమున తగ్గిపోయాయని శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు మళ్లీ పూర్వ వైభవం తెలియజేసి జన్మాష్టమి వేడుకలను 11 రోజులు చేసే విధంగా దైవ విధానాన్ని తెలియజేశారని, ఆధ్యాత్మిక గ్రంథాలు త్రైత సిద్ధాంత భగవద్గీత అనుబంధ 101 గ్రంథాలు రచించి అందించారని ఎంతో విలువైన దైవ జ్ఞానము ఆ గ్రంథాల్లో ఉంది అనే విషయం ప్రజలందరూ గమనించాలని ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో దైవభావంతో నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ ఎస్సై ఏ ప్రవీణ్ కుమార్ ను పూజ కార్యక్రమంలో పాల్గొని దైవ జ్ఞాన అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేశారూ.ఈ కార్యక్రమంలో ఇందు జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి ఎల్కతుర్తి శాఖ అధ్యక్షులు,ఆలయ అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి, శ్రీరామోజు సతీష్ చారి, కందుకూరి మహేష్ చారి, సంతోష్, పాల్గొన్నారు.