Listen to this article

జనం న్యూస్7 అక్టోబర్ ప్రతినిధి కాసిపేట రవి

భీమారం మండల కేంద్రంలోని భీమారం బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారి పై రాఖీ అమ్మకాలకు రోడ్డుపై టెంట్లు వేసి రవాణా రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు ప్రయాణికులు ట్రాఫిక్ అంతరాయం జరిగి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని ప్రజలు అంటున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా నియంత్రించాలని కోరుతున్నారు. టెంట్లను రోడ్లపై తీసివేసి వాహనాలు సజావుగా రవాణా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని వాహనదారులు విన్నవించారు