Listen to this article

జుక్కల్ జూలై 12 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సందర్శించారు.పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యేకి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు..పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి,విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు..విద్యార్థులతో ముచ్చటిస్తూ..వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు..పాఠశాలలో సమస్యలు మరియు మౌళిక సదుపాయాల గురించి ప్రిన్సిపాల్ మరియు సిబ్బందితో చర్చించారు..విద్యార్థులకు నాణ్యమైన విద్యా, భోజనం అందించాలని సూచించారు..విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తుగా ప్రజా ప్రభుత్వం భావిస్తోందని, దీనిలో భాగంగా విద్యార్థులపై ఖర్చు పెట్టే ప్రతి పైసా అది ఖర్చు కాదు రేపటి బంగారు తెలంగాణకు పెట్టుబడి లాంటిదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు..గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యకు రాష్ట్ర బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు..అలాగే విద్యా వ్యవస్థలో మార్పుకు శ్రీకారం చుట్టాలని ఉద్దేశ్యంతో విద్యా కమీషన్ ఏర్పాటు, అంగన్వాడీలను ఫ్రీ ప్రైమరీ స్కూల్స్ గా మార్చడం, గురుకుల విద్యార్థులకు మెస్ చార్జీలు 40% కాస్మోటిక్ చార్జీలు 200% పెంచడం జరిగిందని వివరించారు..కేవలం వసతులు కల్పించడమే కాదు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యంతో మెగా డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని, అలాగే పారదర్శకంగా టీచర్స్ బదిలీలను కూడా నిర్వహించి విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు.గతంలో చాలిచాలని బడ్జెట్ తో విద్యార్థులకు మెనూ ప్రకారం సరైన భోజనం అందించలేదని, అరటి పండు ఇస్తే గుడ్డు ఇవ్వలేదు, గుడ్డు ఇస్తే పాలు ఇవ్వలేదు ఇలా ఎదో ఒక రకంగా మెనులో కోత విధించేవారని,ఇవ్వన్నీ గమనించిన ముఖ్యమంత్రి గారు ఆకలి కడుపుతో విద్యార్థుల ఎదుగుదలకు చదువుకు నష్టం వాటిల్లుతుందని, గురుకుల విద్యార్థులకు మెస్ చార్జీలు,కాస్మోటిక్ చార్జీలు పెంచడం జరిగిందని తెలిపారు