

జనం న్యూస్ ఆగస్టు 18:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల
మండలంలోని గుమ్మిర్యాల గ్రామంలోగత కొన్ని రోజుల నుండి ఎడతెరిపి వర్షాల కారణం గా రోడ్డు పైన గుంతలుగా ఏర్పడిన నీరు బయటకు పోవటానికి దారి లేక అక్కడనే నిలిచిపోయింది దీనివలన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాదాచారులు, ద్విచక్ర వాహనదారులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు.రోడ్లు భవనాలశాఖ అధికారులకు, మండల అధికారులకు ఎన్ని సార్లు విన్నవించిన ఫలితం లేదు అని గ్రామ ప్రజలు వాపోయారు. గ్రామాలలో సర్పంచ్లు లేక గ్రామాభివృద్ధి కుటుంబడింది అనేది సందేహం లేకపోలేదు అని చెప్పవచ్చు.ఇప్పటికైన అధికారులు స్పందించినిలిచిన నీరు బయటకు పోవటానికి పరిష్కారం కనుగొనలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
