Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 21 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ ) పర్యవేక్షణలో ఈ రోజు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ విద్యార్థులకు ఇంటెన్సీఫైడ్ ఐ ఈ సి క్యాంపెయిన్ 2025 ద్వార ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమములో జోనల్ సూపర్వైజర్ బి నాగేశ్వరరావు మాట్లాడుతూ యువకులకు హెచ్ఐవి ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదని అలాంటి వారిని ప్రేమతో ఆదరించాలని వారిపై చిన్నచూపు వివక్షత చూపరాధని వివరించారు తరువాత హెచ్ఐవి ఎయిడ్స్ అంటే ఏమిటి ఎన్ని విధాలుగా వస్తుంది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి మరియు యాంటీ రిట్రో వైరల్ తెరఫీ మందులు గురించి వివరించారు అదేవిధంగా విద్యార్థులు చదువుతోపాటు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పి మరియరాణి స్కూల్ హెచ్ ఎం పి ఎస్ సునీత దేవి, ఎ యన్ యం యన్ కోటమ్మ ఆశ కార్యకర్తలు విమలకుమారి కస్తూరి ఏసుమ్మ మేరి రూతు, మరియు క్లస్టర్ లింక్ వర్కర్ షేక్ మేమున్నిష మరియు స్కూల్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు