

జనంన్యూస్. 22. నిజామాబాదు. సిరికొండ.
నిజామాబాదు రూరల్ సిరికొండ మండలంలో చీమనపల్లి రైతు వేదికలో తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును పలు రకాల సబ్సిడీ లతో సాగును ప్రోత్సహిస్తుందని,ఈ పంటను ఒకసారి నాటితే 4 సంవత్సరాల తర్వాత నిరంతర ఆదాయాన్ని 30సంవత్సరాల పాటు ఇస్తుందని,కోతులు ముట్టని, పందుల బెడద దొంగల బెడద లేని తక్కువ కూలీలు అవసరమయ్యే పంట ఆయిల్ పామ్ అని తెలిపారు. NMEO-OP స్కీమ్ కింద ఈ కింది సబ్సిడీలు ఉన్నాయి: 1)మొక్కలకు 90%రాయితీ కింద రైతు కేవలం ఒక ఎకరానికి 1000 చొప్పున జిల్లా ఉద్యాన & పట్టుపరిశ్రమ అధికారి నిజామాబాద్ పేరిట డీడీ చెల్లిస్తే 50 మొక్కలు ప్రీ యూనిక్ కంపెనీ వారిచే అందిస్తామని తెలిపారు.2) ఆయిల్ పామ్ మధ్యలో అంతర పంటల సాగు(మొక్కజొన్న,జొన్న,పసుపు,కూరగాయలు,సోయా etc) చేసినందుకు గాను ఎకరానికి 4200/ చొప్పున రైతు ఖాతాలో సంవత్సరానికి ఒకసారి జమ చేస్తున్నామని 3) ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు చిన్న, సన్నకారు, ఐదెకరాల లోపు ఉన్నవారికి 90% రాయితీ,SC/ST రైతులైతే 100% రాయితీ,5 ఎకరాల మీదా సాగు చేసేవారు 80% రాయితీ కింద డ్రిప్ సౌకర్యం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ADA నిజామాబాద్ రూరల్ M. కృష్ణ , mao సిరికొండ T నర్సయ్య , HEO రోహిత్, aeo నిఖిల్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.